ములకలపల్లి :మన్యం న్యూస్ (అక్టోంబర్ 01):
అక్టోంబర్ నెల 14 నుంచి 18 వరకు విజయవాడ లో సిపిఐ అల్ ఇండియా మహాసభలు జరగనున్నాయని,ఈ మహాసభలకు ప్రపంచం లో గల 20 దేశాల నుంచి కమ్యూనిస్టు పార్టీల ప్రతునిధులు దేశం నలుమూల నుంచి, 5 లక్షల మంది ప్రజానీకం బహిరంగ సభకు రానున్న నేపథ్యం లో దేశం లో గల నాలుగు రాష్ట్రల కేరళ ,బీహార్ ,తెలంగాణ , తమిళనాడు ముఖ్యమంత్రులు సిపిఐ జాతీయ మహాసభల లకు హాజరు కానున్నారని,సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు నరాటి ప్రసాద్ తెలిపారు.ములకలపల్లి నిర్వహించిన సిపిఐ సమావేశం లో నరాటి ప్రసాద్ మాట్లాడుతూ దేశం లో బీజేపీ ప్రభుత్వం ను గద్దె దించె ప్రయత్నాలకు, సిపిఐ జాతీయ మహాసభలు కేంద్రం గా విపక్షాలు ఏకతాటికీ రానున్నాయని అన్నారు. బీజేపీ పాలన నుంచి దేశాని కి విముక్తి కోసం కమ్యూనిస్టు పార్టీలు కార్యాచరణ. ఈ జాతీయ మహాసభల్లో తీసుకోబోతున్న నిర్ణయాలతో దేశం లో పెనుమార్పులు జరగున్నాయని, కావున 14 తారీకు న బహిరంగసబ కు 110 బస్సు లు జిల్లా లో ప్రజలకు ఏర్పాటు చెయ్యనున్నారని, కావున ప్రజలు అధిక సంఖ్య లో తరలిరావాలని కోరరు.ఈ సమావేశం లో సిపిఐ మండల కార్యదర్శి ఎండి యూసుఫ్, నరాటీ రమేష్, ఎస్ కె జబ్బార్, పూనెం రాంచందర్, కాశిమ్, వీరు, అప్పారావు,తదితరులు పాల్గొన్నారు
Post A Comment: