మన్యం మనుగడ, మంగపేట. :
మంగపేట మండల కేంద్రంలోని కమలాపురం గ్రామంలో భారత జాతిపిత మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా బీజేపీ మంగపేట మండల అధ్యక్షులు లోడే శ్రీనివాస్ గౌడు ఆధ్వర్యంలో బీజేపీ రాష్ట్ర గిరిజన మోర్చా అధికార ప్రతినిధి తాటి కృష్ణముఖ్య అతిథిగా హాజరై మహాత్మా గాంధీ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా తాటికృష్ణ మాట్లాడుతూ భారతదేశం గర్వించదగ్గ నాయకులలో ఒకరు మహాత్మాగాంధీ అందుకే మహాత్మా అని పిలుస్తున్నాం, మన జాతిపిత మహాత్మా గాంధీ,భరతజాతికి చేసిన సేవలను గుర్తుచేశారు.ఆ తర్వాత స్వచ్ఛభారత్ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి గాజుల కృష్ణ, జిల్లా సీనియర్ నాయకులు పాకనాటి వెంకటరెడ్డి, రామిడి సురేష్, జిల్లా దళిత మోర్చా ప్రధాన కార్యదర్శి గద్దల రఘు,గాజుల పవన్,గుండెబోయిన సంతోష్, నిమ్మల నరేష్,వంగపండ్ల శ్రీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: