జూలూరుపాడు, అక్టోబర్ 1, (మన్యం న్యూస్ ప్రతినిధి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జూలూరు పాడు మండల కేంద్రం శనివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నంగారా భేరి లంబాడి హక్కుల పోరాట సమితి (ఎల్ హెచ్ పి ఎస్) భద్రాద్రి జిల్లా ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ.. ఆదివాసీ సంఘాలు చేసిన ఎన్నో పోరాటల ఫలితంగా కెసిఆర్ ప్రభుత్వం గిరిజనుల రిజర్వేషన్లను పెంచారని అన్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్ ప్రక్రియ 6% నుండి 10% వరకు పెంచినందుకు కెసిఆర్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం కరోనా సమయంలో రద్దు చేసిన జీ ఓ నెంబర్ 03 ను పునరుద్దరించక పోతే భారీ ఎత్తున ఉద్యమ కార్యాచరణలు అమలు చేస్తామని కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేసారు. ఈ కార్యక్రమం లో ఎల్ హెచ్ పి ఎస్ వైరా నియోజకవర్గ ఇంచార్జి నాగేశ్వరావు నాయక్, జై ఆదివాసీ యువశక్తి భద్రాద్రి జిల్లా అధ్యక్షులు బొర్రా సురేష్ దొర, ఎల్ హెచ్ పి ఎస్ జిల్లా, మండల నాయకులు జై ఆదివాసీ యువ శక్తి నాయకులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: