CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

గాండ్ల గూడెం పోడు రైతులు ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రభుత్వ విప్ రేగా, ఎమ్మెల్యే మెచ్చాల చిత్రపటానికి పాలభిషేకం

Share it:


  •  గాండ్ల గూడెం పోడు రైతులు ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రభుత్వ విప్ రేగా, ఎమ్మెల్యే మెచ్చాల చిత్రపటానికి పాలభిషేకం 
  •  పోడు సమస్య పరిష్కారం ఆనందం వ్యక్తం చేసిన గాడ్లగూడెం రైతులు


మన్యం న్యూస్, అశ్వారావుపేట: మండల పరిధిలోని గాండ్లగూడెంలో 150 ఎకరాల పోడు భూములు పోడు సాగుదారులు వ్యవసాయ పంటలు వేసి చేతికి వచ్చే టైంకి, పోడు భూములకు వెళ్లకుండా ఫారెస్ట్ అధికారులు అడ్డుకొని ఇబ్బంది పెట్టడంతో ఆందోళనకి చెందిన పోడు రైతులు ఫారెస్ట్ అధికారులు ఎదుట పురుగుల మందు త్రాగుతామని ఆందోళన చేసిన విషయం పది రోజుల క్రితం జరిగింది విధితమే అయితే ఈ యొక్క సమస్యను అశ్వరావుపేట సర్పంచ్ల సంఘం అధ్యక్షులు మల్లాయి గూడెం సర్పంచ్ నారం రాజశేఖర్ ప్రత్యేక చొరవ తీసుకొని విషయాన్ని అశ్వరావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు, ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగకాంతరావుల దృష్టికి తీసుకువెళ్లి ఫారెస్ట్ ఉన్నతాధికారులతో మాట్లాడించి గాండ్లగూడెం రైతులను ఇబ్బంది పెట్టకుండా వారు పోడు వ్యవసాయం చేసుకునే విధంగా మాట్లాడించడం జరిగింది. వారి పోడు భూముల్లో వారు వెళ్లడానికి ఫారెస్ట్ ఉన్నత అధికారులుతో మాట్లాడి పోడు భూముల్లో వ్యవసాయం చేయడానికి అవకాశం కల్పించినందుకు అందుకు కృషి చేసిన సర్పంచ్ నారం రాజశేఖరకు కృషిజ్ఞతలు తెలిపి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రభుత్వ విప్ రేగ కాంతారావు, ఎమ్మెల్యే మెచ్చా ల చిత్రపటంకి గాండ్ల గూడెం పోడు రైతులు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో గాండ్లగూడెం పోడు రైతులు అనేకమంది పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: