జూలూరుపాడు, అక్టోబర్ 2, (మన్యం న్యూస్ ప్రతినిధి) గాంధీ జయంతి, మరియు లాల్ భహధూర్ శాస్త్రి పుట్టిన రోజు సందర్భంగా ఆదివారం జూలూరుపాడు మండల కేంద్రంలో ప్రధానమంత్రి ఉజ్వల ఉచిత గ్యాస్ లు 21 మంది లబ్ధిదారులకు బిజెపి జిల్లా అధ్యక్షులు కోనేరు సత్యనారాయణ (చిన్ని) పంపిణీ చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం పేదల కోసం ఎన్నో రకాల సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతుందని అన్నారు. సురక్ష యోజన, ప్రధాన మంత్రి జీవన యోజన, ఫసల్ బీమా యోజన, కిసాన్ సమ్మాన్ యోజన, వంటి పథకాలను ప్రజలు వినియోగించుకోవాలని కోరారు. ఇవే కాకుండా గ్రామాల అభివృద్ధి కొరకు 100% కేంద్ర ప్రభుత్వమే నిధులు కేటాయిస్తుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో బిజెపి కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి చిలుకూరి రమేష్, కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు మదినే సతీష్, బిజెపి మండల అధ్యక్షుడు సిరపురపు ప్రసాద్, జేష్ట నరేష్, దర్శినాల కృష్ణయ్య, సిరిపురపు పుల్లారావు, వందనపు సుబ్బు, రవీందర్, తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: