మన్యం న్యూస్ : జూలూరుపాడు, (అక్టోబర్ 5) తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి టిఆర్ఎస్ అధినేత కెసిఆర్ బుధవారం హైదరాబాదులోని తెలంగాణ భవన్ లో కెసిఆర్ అధ్యక్షతన జరిగిన సర్వసభ్య సమావేశంలో పార్టీ పేరును మార్చుతూ తీర్మానాన్ని ప్రవేశ పెట్టగా పార్టీ నేతలంతా ఏకగ్రీవంగా ఆమోదం తెలపడంతో, టిఆర్ఎస్ (తెలంగాణ రాష్ట్ర సమితి) పేరును బిఆర్ఎస్ (భారత్ రాష్ట్ర సమితి) గా పేరును మార్చుతున్నట్లు ప్రకటించిన సందర్భంగా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జూలూరుపాడు మండల కేంద్రంలో టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు చౌడం నరసింహారావు ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు బాణాసంచా పేల్చి సంబరాలు జరుపుకున్నారు. తమ అభిమాన నాయకుడు కెసిఆర్ ఇకపై జాతీయ రాజకీయాలలో రాణించాలని ఆకాంక్షించారు. కెసిఆర్ నాయకత్వం వర్ధిల్లాలి, జై, బిఆర్ఎస్ జై, జై, బిఆర్ఎస్ అంటూ నినదించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీపీ లావుడ్యా సోనీ, సొసైటీ చైర్మన్ లేళ్ళ వెంకటరెడ్డి, మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షులు యదళ్ళపల్లి వీరభద్రం, పార్టీ నాయకులు ఎల్లంకి సత్యనారాయణ, లాకావత్ గిరిబాబు, వేల్పుల నరసింహారావు, నున్న రంగారావు, రామిశెట్టి నాగేశ్వరరావు, చాపల మడుగు రామ్మూర్తి, వెంగన్నపాలెం ఎంపీటీసీ దుద్దుకూరి మధుసూదన రావు, జూలూరుపాడు ఎంపిటిసి పెండ్యాల రాజశేఖర్, బోజ్యా తండా సర్పంచ్ కిసాన్ లాల్, పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Post A Comment: