మన్యం మనుగడ, మంగపేట. :
బహుజన్ సమాజ్ పార్టీ బీఎస్పీ ఏటూరునాగారం మండల అధ్యక్షులు ఎంపెళ్లి రాజు, ములుగు అసెంబ్లీ ఇంచార్జీ ఎంపెళ్లి వీరస్వామి, బీఎస్పీ ములుగు మీడియా కన్వీనర్ మంద సతిష్ ఆధ్వర్యంలో
ఏటూరునాగారం సబ్ డివిషనల్ పరిధిలోని ఏటూరునాగారం, మంగపేట, కన్నాయిగూడెం, మండలాల లోని అర్హులైన గోదావరీ వరద బాధితులకు ఆర్థిక సహాయం అందక ఇబ్బంది పడుతున్న ప్రజల గురించి..
ఏటూరునాగారం, మంగపేట మండలాలలోని ప్రజల గురించి..
👉గోదావరికి శాశ్వత మైన కరకట్ట నిర్మాణం గురించి..
👉పొడు భూముల కు పట్టాలు ఇప్పించుట గురించి..
👉ఏజెన్సీలోని విష జ్వరాలు గురించి..
మంత్రి హరీష్ రావుకు, మంత్రి సత్యవతి రాథోడ్ కు ప్రజా సమస్యలపై ధరఖాస్తు ఇవ్వడానికి వెళుతుంటే ఏటూరునాగారం ఎస్ ఐ రమేష్ మమ్మల్ని ఆధీనంలో కి తీసుకొని,మంగపేట పోలీస్ స్టేషన్లలో ముందస్తుగా కస్టడీలోకి తీసుకోవడం జరిగింది.
మంత్రికి ప్రజల సమస్యలపై దరఖాస్తు ఇవ్వలేని పరిస్థితిలో ఈ తెలంగాణ ప్రభుత్వం ఉన్నందుకు,ఈ తెలంగాణ ప్రభుత్వం యొక్క చర్యను బి ఎస్పీ పార్టీ ఖండిస్తున్నామని ఈ సందర్బంగా తెలియజేశారు.
Post A Comment: