మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి అక్టోబర 05 ... రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ టిఆర్ఎస్ పార్టీని జాతీయ స్థాయిలో బీఆర్ఎస్ గా ప్రకటించడం ఇదొక చారిత్రాత్మక నిర్ణయం అని కొత్తగూడెం మున్సిపాలిటీ చైర్ పర్సన్ కాపు సీత లక్ష్మి అన్నారు. బుధవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని కొత్తగూడెం మున్సిపాలిటీ ఆరో వార్డులో చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి టిఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా ప్రకటించడంతో కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ఆదేశాల మేరకు బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు . ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి చెందినట్టుగా దేశం మొత్తం అభివృద్ధి చెందాలని టిఆర్ఎస్ పార్టీని ప్రకటించిన ముఖ్యమంత్రి కేసీఆర్.. 21 సంవత్సరాల టిఆర్ఎస్ ప్రస్తానం లో కీలక మలుపు అని..గోల్కొండ కోట నుంచి ఎర్ర కోట కు గులాబీ దండు కదిలిందని జాతీయ పార్టీని ప్రకటించిన సీఎం కేసీఆర్ కు శుభాకాంక్షలు తెలియజేస్తూ కేసీఆర్ రాబోయే కాలంలో ప్రధాన మంత్రి కావాలని కోరుకుంటున్నాం అన్నారు. ఈ కార్యక్రమంలో టీబీజీకేఎస్ 11 మెన్ కమిటీ సభ్యులు కాపు కృష్ణ. సూరిబాబు,సత్యనారాయణ, షెరిఫ్,నరేష్,శ్రీను.తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: