మన్యం న్యూస్, అశ్వరావుపేట: బ్రిటిష్ వారి విముక్తి నుండి భారతదేశానికి స్వతంత్రం తేవడానికి సత్య అహింస మార్గాల ద్వారా ఎంతో కృషిచేసి స్వతంత్రం వచ్చేంతవరకు పోరాడిన మహాత్మా గాంధీ జయంతి నేడు. అలాంటి గాంధీ జయంతినాడు మద్యం, మాంసం ముట్టుకోకూడదని ప్రభుత్వ ఆంక్షలు ఉన్నప్పటికీ కొంతమంది అవేమి వారికి తెలియదు అన్నట్లు వ్యవహరిస్తున్నారు. అశ్వారావుపేట మండలం వినాయకపురం గ్రామంలో అన్ని చికెన్ దుకాణాలు తెరిచి ఉన్నాయి గాంధీ జయంతి రోజు మాంసం మద్యం అమ్మకూడదు కానీ వినాయకపురం లో మాత్రం అవి ఏవి మాకు పట్టవు అన్నట్లుగా ఉంది దుకాణదారులు ని అడిగితే మాకు పంచాయతీ వారు గాని ఎవరు ఏమి చెప్పలేదు అంటున్నారు మాంసం దుకాణదారులు.
Navigation
Post A Comment: