మన్యం న్యూస్ ప్రతినిధి చండ్రుగొండ : తిప్పనపల్లి డంపింగ్ షెడ్ లో పేకాట ఆడుతున్న నలుగురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు ఎస్సై విజయలక్ష్మి తెలిపారు. శనివారం తిప్పనపల్లి గ్రామ శివారులో డంపింగ్ షెడ్ లో పేకాట ఆడుతున్నట్లు సమాచారం మేరకు పోలీసులు దాడులు చేయగా, నగదు 4300,నలుగురు వ్యక్తులతో పాటు, మూడు సెల్ ఫోన్స్, మూడు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు ఆమె తెలిపారు. గ్రామాలలో పేకాట ఆడేటప్పుడు సమాచారం ఇవ్వాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచటం జరుగుతుందని, చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై విజయలక్ష్మి స్పష్టం చేశారు. ఈ దాడుల్లో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
Navigation
Post A Comment: