- సిఏం కెసిఆర్, ప్రభుత్వ విప్ రేగా చిత్రపటానికి పాలాభిషేకం చేసిన గిరిజన ప్రజాప్రతినిధులు.
- గిరిజనులకు 10% రిజర్వేషన్ పెంపు పట్ల హర్ష వ్యక్తం చేసిన ఎస్టీ సెల్ అధ్యక్షులు పాయం. రాజబాబు,ఎంపీపీ రేగా కాళికా
మన్యం న్యూస్ కరకగూడెం: జనాభా ప్రతిపాదిక ప్రకారం ఎస్టీలకు 10 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేయడం పట్ల మండలంలోని ఆదివాసి గిరిజన సర్పంచులు, ఎంపీపీ,ఎస్టీ సెల్ అధ్యక్షులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ రేగా కాళికా,ఎస్టీ సెల్ అధ్యక్షులు పాయం.రాజబాబు మాట్లాడుతూ ఎస్టీల రిజర్వేషన్ ఆరు నుంచి 10 శాతానికి పెంచుతూ జీవో నెంబర్ 33 ను తీసుకొచ్చిన మహానేయుడు సీఎం కేసీఆర్ అన్నారు.తెలంగాణలో ఆదివాసి, బంజారా గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్ పెంచుతు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మహ అద్బుతమైనదని అన్నారు. ఏజెన్సీలో అభివృద్ధి రిజర్వేషన్ ప్రక్రియ సమర్థవంతంగా వినియోగించుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచుల సంఘం మండల అధ్యక్షులు పాయం. నరసింహారావు, సర్పంచులు ఇర్ప. విజయ్,జవాజి.రాధా, పోలబోయిన.పాపక్క,తాటి. సరోజిని, తోలెం.సావిత్రి,గొగ్గలి. నాగమణి,కుంజా.వసంతరావు, కొమరం.విశ్వనాథం, గిరిజన నాయకులు,టిఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
Post A Comment: