CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

బురదమయంగా మారిన మండల కేంద్రం..! డ్రైనేజీ పనులు త్వరగా చేపట్టమని వేడుకుంటున్న వ్యాపారులు..

Share it:



మన్యం న్యూస్ :  జూలూరుపాడు, (అక్టోబర్ 7) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జూలూరుపాడు మండల కేంద్రంలో డ్రైనేజ్, సెంట్రల్ లైటింగ్, డివైడర్ గ్రిల్స్ ఏర్పాటు కొరకు ఇటీవల 5.22 కోట్ల రూపాయలు మంజూరి అయిన సంగతి పాఠకులకు విధితమే. దీనిలో భాగంగా మండల కేంద్రంలో ప్రధాన రహదారికి ఇరువైపున డ్రైనేజీ పనులను ప్రారంభించారు. కానీ కొంతకాలంగా పనులు నిలిచిపోయాయి. వర్షాకాలం కావడంతో ఏ చిన్నపాటి వర్షం పడిన ప్రధాన రహదారికి ఇరువైపులా నీరు నిలిచి బురదమయంగా మారి వ్యాపారులు, పాదచారులు, మండల కేంద్రంలోని ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయమై పై పంచాయతీ అధికారులు గాని, ఆర్ అండ్ బి శాఖ అధికారులు గాని పట్టించుకోవడం లేదంటూ వ్యాపారులు వాపోతున్నారు. అధికారులు, ప్రజా ప్రతినిధుల నిర్లక్ష్యం వల్లనే కాంట్రాక్టర్లు సకాలంలో పనులు పూర్తి చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించి నిలిచిపోయిన డ్రైనేజీ పనులను పూర్తి చేపించాలని వేడుకుంటున్నారు

Share it:

TELANGANA

Post A Comment: