మన్యం న్యూస్, పినపాక: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలంలోని టిఆర్ఎస్ శ్రేణులు దసరా పండుగ రోజున తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ టిఆర్ఎస్ పార్టీని బిఆర్ఎస్ పార్టీగా ప్రకటించడం పట్ల వారి సంతోషాన్ని తెలియజేశారు.ఈ సందర్భంగా, టిఆర్ఎస్ పార్టీ పినపాక మండల అధ్యక్షుడు పగడాల సతీష్ రెడ్డి ఆధ్వర్యంలో టీఆర్ఎస్ శ్రేణులు బయ్యారం క్రాస్ రోడ్ లో బాణసంచా కాల్చి, తమ ఆనందాన్ని పంచుకున్నారు. రాష్ట్రస్థాయిలో ఉన్న పార్టీ జాతీయ స్థాయిలో ప్రకటించడం పట్ల, ఆనందంగా ఉందని, జాతీయస్థాయిలో టిఆర్ఎస్ పార్టీని నిలబెట్టడం కేసీఆర్ ఒక్కడికే సాధ్యమైందని మండల అధ్యక్షుడు సతీష్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, టిఆర్ఎస్ పార్టీని రాష్ట్రస్థాయిలో ప్రజలు ఆదరిస్తున్నారని, ప్రస్తుతం ప్రకటించిన డిఆర్ఎస్ పార్టీని అదేవిధంగా ఆదరిస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Navigation
Post A Comment: