మన్యం మనుగడ ప్రతినిధి, అశ్వాపురం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం మొండికుంట గ్రామపంచాయతీలో సర్పంచ్ మర్రి మల్లారెడ్డి అధ్యక్షతన వృద్ధుల దినోత్సవ సందర్భంగా వృద్ధులను ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అశ్వాపురం ఎమ్మార్వో సురేష్ కుమార్ మాట్లాడుతూ వృద్ధులను గౌరవించుకోవడం అనాదిగా వస్తున్న సంప్రదాయమని ప్రతి వ్యక్తికి వృద్ధాప్యం తప్ప
దని ముసలితనం బారిన పడిన తల్లిదండ్రులను తమ బిడ్డలు కంటికి రెప్పలా కాపాడుకోవాలని ఎమ్మార్వో సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్ ఐ నాగమణి, ఉప సర్పంచ్ సుధీర్, ఎంపీటీసీ నరేష్, మాజీ ఎంపీపీ కొల్లు మల్లారెడ్డి, సెక్రెటరీ సైదులు సిపిఐ పార్టీ నాయకులు కమటం వెంకటేశ్వరరావు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కొండ బత్తుల ఉపేందర్, టీజేఎస్ నాయకులు సురకంటి ప్రభాకర్ రెడ్డి, బిజెపి నాయకులు ముసుకు శ్రీనివాస్ రెడ్డి, ఏం సి డైరెక్టర్ కందాల ఈశ్వర్, సొసైటీ డైరెక్టర్ కదరాబాద సందీప్, మరియు ఆశ వర్కర్లు అంగన్వాడీ టీచర్లు గ్రామస్తులు వృద్ధులు తదితరులు పాల్గొన్నారు
Post A Comment: