మన్యం న్యూస్, దుమ్ముగూడెం ::
గత సంవత్సరం ఉత్తరప్రదేశ్లోని లెక్కింపు కేరి అనే ప్రాంతంలో రైతులు ప్రదర్శన చేస్తున్న తరుణంలో కేంద్రమంత్రి అజయ్ మిశ్రా కొడుకు అసిస్ మిశ్రా కారుతో విధ్వంసకరంగా తొక్కించుకుంటూ పోవడంతో ఐదుగురికి అక్కడక్కడ మృతి చెందడం జరిగింది ఈ ఘటన జరిగి ఏడాది పూర్తయినప్పటికీ దోషులకు ఎటువంటి శిక్ష పడకపోగా స్వతంత్రంగా తిరుగుతున్నారని ఇటువంటి వారిని శిక్ష పడకుండా చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం లోని నరేంద్ర మోడీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని వారు కోరారు ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా అధ్యక్షులు ఆధ్వర్యంలో భీమవరం గ్రామంలోని నరేంద్ర మోడీ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు అలానే దోషులను కఠినంగా శిక్షించి కేంద్ర మంత్రి పదవి నుంచి అజయ్ మిశ్రా తొలగించాలని వారు ప్రభుత్వాన్ని కోరారు ఈ ఘటన నిరసనగా కిషన్ మోర్చా పిలుపుమేరకు అన్ని మండల కేంద్రంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మలను దగ్ధం చేస్తూ నిరసన తెలిపారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి చంద్రయ్య ఆదివాసి గిరిజన సంఘం సహాయ కార్యదర్శి కారం పుల్లయ్య మహిళా సంఘం మండల కమిటీ సభ్యురాలు నాగమణి ఆదివాసి గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షులు సోయం జోగారావు సర్పంచ్ తోడెం తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు
Post A Comment: