మన్యం న్యూస్ ప్రతినిధి, చండ్రుగొండ: తెలంగాణ రాష్ట్ర సమితి( టిఆర్ఎస్) పార్టీ పేరును భారత్ రాష్ట్ర సమితి( బిఆర్ఎస్) మారుస్తూ సీఎం కేసీఆర్ ప్రకటించినందుకు గాను చండ్రుగొండ మండల టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు ధారా వెంకటేశ్వరరావు (బాబు ) ఆధ్వర్యంలో కార్యకర్తలతో (బిఆర్ఎస్) భారత్ రాష్ట్ర సమితి పార్టీని స్వాగతిస్తూ చండ్రుగొండ ప్రధాన సెంటర్లో టపాసులు పేలుస్తూ, ఘనంగా సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ధారా వెంకటేశ్వరరావు (బాబు )మాట్లాడుతూ... భారత దేశంలోనే తెలంగాణ రాష్ట్రం నెంబర్ వన్ గా అన్ని సంక్షేమ పథకాలు నిరుపేదలకు అందించడంలో సఫలీకృతమైన మన సీఎం కేసీఆర్, భారత్ రాష్ట్ర సమితి పార్టీతో భారతదేశంలో నిరుపేదలకు సంక్షేమ పథకాలు అందించేలా అభివృద్ధి బాటలో నడిపించేలా సీఎం కేసీఆర్ కి దేవుడి కృప ఉండాలని ఆయన కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు మేడా మోహన్ రావు,తెరాస మండల సోషల్ మీడియా అధ్యక్షుడు వంకాయలపాటి బాబురావు, మండల ఉపాధ్యక్షుడు సత్తి నాగేశ్వరరావు, మద్దిరాల చిన్న పిచ్చయ్య, గ్రామ శాఖ అధ్యక్షులు కొమ్మినేని చిన్న లక్ష్మణరావు, రమేష్ రెడ్డి, బానోత్ బాలు, తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: