మన్యం న్యూస్, చండ్రుగొండ: మండల అభివృద్ధిపై ఎమ్మెల్యే మెచ్చ నాగేశ్వరరావు ప్రత్యేక మార్కు సాధించారు. ఎమ్మెల్యే మెచ్చ నాగేశ్వరావు హయంలో అభివృద్ధి పరుగులు పెడుతుందని, ప్రధానంగా 14 గ్రామపంచాయతీలలో రూ.1 కోటి రూపాయల అంచనా వ్యయంతో సిసి రోడ్లు నిర్మించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆదేశాల మేరకు 1 కోటి 50 లక్షల రూపాయలతో రైతు వేదికల నిర్మాణం చేశారు. ప్రతి గ్రామ పంచాయతీల్లో స్మశాన వాటికలు, పల్లె ప్రకృతి వనాలు, నర్సరీలు, ఏర్పాటు చేశారు.హరితహారం కార్యక్రమం కింద రహదారుల వెంబడి చెట్లను నాటించారు. మన ఊరు మన బడి కార్యక్రమం కింద 4. కోట్ల రూపాయల వ్యయంతో పాఠశాల అభివృద్ధి చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పథకాలను ప్రజలకు చేరవేస్తూ, ప్రజల సమస్యలను వారి అవసరాలు తీరుస్తూ, తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు మండల అభివృద్ధి ప్రదాతగా టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు ధారా వెంకటేశ్వరరావు(బాబు ) అభివర్ణించారు.
Navigation
Post A Comment: