CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

మహిళా సమాఖ్య నాయకురాలు వట్టికొండ రజనీకుమారి మృతి

Share it:


  •  మహిళా సమాఖ్య నాయకురాలు వట్టికొండ రజనీకుమారి మృతి
  •  నివాళులర్పించిన సిపిఐ రాష్ట్ర నేత కూనంనేని సాంబశివరావు
  •  కన్నీటి విడ్కోలు పలికిన సిపిఐ, ఏఐటియుసి శ్రేణులు

మన్యం న్యూస్, జిల్లా ప్రతినిధి, అక్టోబర్ 01 ..భారత జాతీయ మహిళా సమాఖ్య జిల్లా నాయకురాలు, మాజీ ఏఐఎస్ఎఫ్ నాయకురాలు, చుంచుపల్లి మండల ప్రజాపరిషత్ ఉపాధ్యక్షులు వట్టికొండ మల్లికార్జున్ రావు సతీమణి వట్టికొండ రజనీకుమారి (55) అనారోగ్యంతో చికిత్సపొందుతూ హైద్రాబాద్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలోమృతిచెందారు. మృతదేహాన్ని కుటుంబ సభ్యులు శనివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని ఆమె స్వగృహం చుంచుపల్లి మండలం, గౌతంపూర్కు తరలించారు. సిపిఐ జిల్లా సమితి సభ్యులు, చుంచుపల్లి మండల ప్రజాపరిషత్ ఉపాధ్యక్షులు వట్టికొండ మల్లిఖార్జున్ రావు సతీమణి ఐన రజనీకుమారి మహిళా సమాఖ్య జిల్లా నాయకురాలిగా పనిచేస్తున్నారు. మృతదేహాన్ని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, జిల్లా కార్యదర్శి ఎస్.కె.సాబీర్ పాషా, జిల్లా కార్యవర్గ సభ్యులు బందెల నర్సయ్య, గుత్తుల సత్యనారాయణ, దుర్గరాశి వెంకటేశ్వర్లు, వై.శ్రీనివాసరెడ్డి, సలిగంటి శ్రీనివాస్, మండల కార్యదర్శి వాసిరెడ్డి మురళి, జిల్లా సమితి సభ్యులు దమ్మాలపాటి శేషయ్య, జి. వీరస్వామి, వంగా వెంకట్, కొమారి హన్మంతరావు, బానోతు గోవిందు, నాయకులు తోట రాజు, ఇమ్మానుయేలు, కె.రాములు, బాగం మహేశ్వర్రావు, గుమ్మడి సాగర్ తదితరులు మృతదేహాన్ని సందర్శించి నివాళుర్పించారు. మృతదేహంపై పార్టీ జెండాను కప్పి శ్రద్ధాంజలి ఘటించారు, కుటుంబ సభ్యులకు ప్రఘాడ సానుభూతి వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా కూనంనేని మాట్లాడుతూ విద్యార్ధి దశలోనే కమ్యూనిస్టు భావాలకు ఆకర్షితురాలై ఏఐఎస్ఎఫ్ నాయకురాలిగా సుధీర్గకాలం పనిచేశారని, ప్రస్తుతం మహిళా సమాఖ్య నాయకురాలిగా చుంచుపల్లి ఏజెన్సీలో చురుకైన పాత్ర పోషిస్తున్నారన్నారు. కమ్యూనిస్టు కుటుంబం నుంచి ఓ ఉద్యమ నాయకురాలిని కోల్పోవడం బాధాకరమన్నారు. ప్రజలకోసం, కార్మికవర్గంకోసం అనునిత్యం శ్రమిస్తున్న తన భర్త మల్లిఖార్జున్ రావుకు భార్యగా అందించిన ప్రోత్సాహం వల్లే ప్రజా, కార్మిక సేవకు అంకితమయ్యాడన్నారు. మహిళా, ప్రజా ఉద్యమాల్లో చురుకైన ప్రాతపోషించే రజనీకుమారి లేని లోటు తీర్చలేనిదన్నారు. జిల్లా నలుమూలల నుంచి భారీగా తరళివచ్చిన సిపిఐ, ఏఐటియుసి శ్రేణులు రజనీకుమారికి కన్నీటి విడ్కోలు పలికారు.

Share it:

TELANGANA

Post A Comment: