మన్యం న్యూస్, అశ్వాపురం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం టిఆర్ఎస్ పార్టీ కార్యాలయం నందు మండల మహిళా సంఘం అధ్యక్షురాలు తోకల లత ఆధ్వర్యంలో బతుకమ్మ ఉత్సవాలు కోలాటం,గిరిజన నృత్య ప్రదర్శన ,సాంప్రదాయాలతో ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మండల అధ్యక్షులు కోడి అమరేందర్, జడ్పిటిసి సుదిరెడ్డి సులోక్షణ గోపీ రెడ్డి,వైస్ ఎంపీపీ కంచుగట్ల వీరభద్రం, తెరాస పార్టీ పినపాక నియోజకవర్గం ఎస్సీ సెల్ అధ్యక్షులు వెన్న అశోక్ కుమార్,సీనియర్ నాయకులు కందుల కృషార్జురావు,తోకల దుర్గ ప్రసాద్,నక్కనబోయినా పాపారావు హాజరయ్యారు.ఈ సందర్భంగా మహిళలు,నాయకులు బతుకమ్మ చుట్టారా నృత్యాలు చేశారు, సాంప్రదాయ దుస్తులు ధరించి రంగురంగుల పూలతో బతుకమ్మలను తయారుచేసి ఆటపాటలతో సందడి చేస్తూ ఈ కార్యక్రమంలో హుషారుగా పాల్గొనడంతో బతుకమ్మ ఆటపాటలు సాంప్రదాయాలను ఆకట్టుకున్నాయి.ఈ సందర్భంగా కోడి అమరేందర్ మాట్లాడుతూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన అనంతరం బతుకమ్మ పండుగకు ప్రపంచవ్యాప్తంగా మరింత గుర్తింపు దక్కినదని అన్నారు, తెలంగాణ సాంస్కృతికి ప్రతీక అయినా బతుకమ్మ పండుగ సందర్భంగా ప్రతి ఏడాది ప్రభుత్వం చీరలను అందజేస్తున్నదన్నారు.పూల పండుగ బతుకమ్మను తెలంగాణ ప్రజలు ఘనంగా నిర్వహిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆడపడుచులకు చీరెలను సారెలుగా అందిస్తున్నదని అన్నారు, దేశంలో ఎక్కడలేని విధంగా ఆడపడుచులకు ప్రభుత్వం ప్రతి ఏడాది బతుకమ్మ చీరలను పంపిణీ చేస్తుంది అన్నారు.మండల పార్టీ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది అని అన్నారు.
ఈ కార్యక్రమంలో మండల ఎంపీటీసీ ల సంఘం అధ్యక్షురాలు కందుల దుర్గాభవాని, తుమ్మలచెరువు ఎంపీటీసీ తాటి పూజిత,తుమ్మలచెరువు సర్పంచ్ బండ్ల సంధ్యారాణి,మండల మహిళా ప్రధాన కార్యదర్శి రావుల రాధమ్మ,మండల యువజన నాయకులు తాటి వెంకటేశ్వర్లు,సోమ్లా,డేవిడ్, రావుల అజయ్,వల్లెపోగు రాము,మొదుగు వంశీ,గజ్జి లోహిత్,పూర్ణ,సుదరని,స్వప్న,కాలవ సంసన్,మేకల భాస్కర్, యువజన నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: