మన్యం న్యూస్, దుమ్ముగూడెం ::
దసరా శరన్న నవరాత్రి మహోత్సవంలో భాగంగా మండలంలోని లక్ష్మీనగరం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ వారి దేవాలయంలో దేవీ నవరాత్రులు అత్యంత వైభవంగా నిర్వహించబడుతున్నాయి ఈ కార్యక్రమంలో భాగంగా సప్తమి మూల నక్షత్రం సందర్భంగా కనకదుర్గమ్మ వారు సరస్వతి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు సరస్వతి రూపంలో అమ్మవారు దర్శనం ఇవ్వడంతో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మొక్కలు చెల్లించుకున్నారు విద్యార్థులతో సామూహిక సరస్వతి పూజ నిర్వహించారు భక్తులు గ్రామస్తులు విద్యార్థులు అధిక సంఖ్యలో ఈ పూజా కార్యక్రమం పాల్గొని అమ్మవారి అనుగ్రహాన్ని పాత్రులయ్యారు ఈ కార్యక్రమంలో అర్చకులు రాజగోపాలచార్యులు ఆలయ అధ్యక్షుడు వీర రాఘవరెడ్డి తాతారావు నటరాజ్ స్వామి హరిబాబు శ్రీనివాస్ రెడ్డి సుధాకర్ రెడ్డి నరేందర్ రెడ్డి లక్ష్మీ సుధా శ్రీదేవి సరోజ గ్రామస్తులు భక్తులు పాల్గొన్నారు.
Post A Comment: