మన్యం న్యూస్, అశ్వారావుపేట నియోజక వర్గం: దమ్మపేట మండల కేంద్రంలో స్ధానిక నాయకులతో కలిసి అర్బన్ కాలనీ, మోడల్ కాలనీ, కొత్తపేట, సాయి బాబా గుడి వీధి లో, మరియు బంజారా కాలనీలో శుక్రవారం సాయంత్రం బతుకమ్మ సంబరాల్లో పాల్గొనీ ఆడపడుచులు మరియు చిన్నారులతో కలిసి నృత్యం చేసిన అశ్వారావుపేట నియోజక వర్గ ఎంఎల్ఏ మెచ్చా నాగేశ్వరరావు. ఈ సందర్భంగా మహిళలు ఎంఎల్ఏ మెచ్చాకి ఘన స్వాగతం పలికారు, శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మెచ్చా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పడక ముందు మనం పండుగను జరుపుకున్నాం కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ సారధ్యంలో ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామో ఆ రోజు నుంచి దేశం సైతం మనవైపు చూసి అబ్బురపడేలా పండుగను జరుపుకుంటున్నాం అని అలాగే ప్రతి ఒకరు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ సంతోషంగా పండుగను జరుపుకోవాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు దొడ్డకుల రాజేశ్వరరావు, పోతినేని వెంకట్రావు, వైస్ ఎంపీపీ దారా మల్లికార్జున రావు, ఎంపిటిసి కేదేసి రాధ, ఉప సర్పంచ్ దారా యుగంధర్, టౌన్ అధ్యక్షులు యార్లగడ్డ బాబు, చిన్నంశెట్టి సత్యనారయణ, చిన్నంశెట్టి యుగంధర్, అబ్దుల్ జిన్నా, పానుగంటి చిట్టి బాబు, వార్డ్ మెంబర్ లు పానుగంటి నాగేంద్ర, దారా జ్యోతి, ఇస్లవత్ మంగమ్మ, కవులూరి నాగయ్య, వీర బాబు, బండ్ల లక్ష్మాయ్యా, బెక్కం వెంకటేశ్వరరావు, ఉయ్యాల లక్ష్మి నారాయణ, రొయ్యల కుమార్, వినోద్, మాజీ సర్పంచ్ అంగోతు బాలాజీ, మల్లేశ్వరరావు, గొల్లపల్లి కోటి, పసుమర్తి సుదర్శన్ రావు, చిన్ని, వెంకన్న బాబు తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: