గుండాల అక్టోబర్ 1 (మన్యం మనుగడ) గిరిజనులకు తెలంగాణ రాష్ట్రంలో 10 శాతం రిజర్వేషన్ పెంపుతూ గిరిజనుల గుండెల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ చిరస్వనియంగా నిలిచిపోతారని టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు తెల్లం భాస్కర్ అన్నారు. శనివారం కేసీఆర్ చిత్రపటానికి పార్టీ నాయకులతో కలిసి పాలాభిషేకం చేసి అనంతరం ఆయన మాట్లాడుతూ రిజర్వేషన్ల పెంపు చారిత్రాత్మక నిర్ణయమని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని అత్యధికంగా సంక్షేమ పథకాలు అమలవుతున్నాయన్నారు. 57 ఏళ్ల నిండిన 10 లక్షల మందికి నూతనంగా పెన్షన్లు మంజూరు చేయడం ఇప్పటికే జరిగిందన్నారు. టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో రాష్ట్రం ముందుకు దూసుకుపోతుందన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ లింగయ్య, పార్టీ నాయకులు వీరస్వామి, లక్ష్మీనారాయణ, వట్టం రవి, సనప కృష్ణ , తదితరులు పాల్గొన్నారు
Navigation
Post A Comment: