మన్యం మనుగడ, మంగపేట. :
ములుగు జిల్లా మంగపేట మండలంలో వీఆర్ఏ ల నిరవధిక సమ్మె 74 వ రోజుకు చేరుకుంది.ఈ కార్యక్రమంలో మండలంలో ఉన్న వీఆర్ఏ లు మాట్లాడుతూ వీఆర్ఏ లకు ఆదివారాలు, పండగలు అని సెలవులు లేకుండా నిర్వీరామంగా 74 వ రోజుల నుండి వీఆర్ఏలు, వారి పిల్లలతో సమ్మె చేస్తున్నామని,వీఆర్ఏ లు అందరూ మనోస్థైర్యాన్ని కోల్పోతున్నారని పండగ పూట జీతాలు లేక కాళీ కడుపులతో అనేక ఇబ్బందులు పడుకుంటు కూడా సమ్మె చేస్తున్నామని పేర్కొన్నారు.రాష్ట్ర ప్రభుత్వం వీఆర్ఏ ల సమస్యల పట్ల ఇంత నిర్లక్ష్యం తగదని వారు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో వీ ఆర్ఏ ల మండల అధ్యక్షుడు పాగ బాబు, ఉపాధ్యక్షుడు కర్రి నాగార్జున,ప్రధాన కార్యదర్శి కర్రి నర్సింహ మూర్తి, కోశాధికారి మాటూరి కౌసల్య , సభ్యులు,నర్సింహారావు,గౌసియా బేగం, సమ్మయ్య ,రాజేశ్వరి,కనుకు సమ్మక్క,పగిడమ్మా,రాణి,రాము, ఈశ్వరమ్మ, శ్రీను , మాధవి, ఖాజా హుస్సేన్ , కార్తిక్,ముత్తయ్య, ఎల్లమ్మ,ముజాఫర్, వెంకటనర్సమ్మ,శిరీష,సందీప్ తదితరులుపాల్గొన్నారు.
Post A Comment: