మన్యం న్యూస్, జిల్లా ప్రతినిధి, అక్టోబర్ 02 ... హింసను వీడి ప్రతి ఒక్కరూ అహింస మార్గంలోనే ప్రతి ఒక్కరూ పయనించాలని దేశానికి చాటిచెప్పిన మహనీయుడు మహాత్మా గాంధీ అని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మోత్కూరి ధర్మారావు అన్నారు . మహాత్మాగాంధీ 153 వ జయంతి వేడుకలను పురస్కరించుకొని ఆదివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని కొత్తగూడెం బస్టాండ్ సెంటర్ , జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం సూపర్ బజార్ త్రీ టౌన్ సెంటర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహాత్మ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ అహింస ఆయుధంగా ఒక్క రక్తపు బొట్టు చిందించకుండా భారతదేశానికి స్వాతంత్రం తీసుకోవచ్చి భారతదేశానికి మహాత్ముడు అయ్యాడని అన్నారు.భారతదేశ ప్రజలందరికీ కులము మతము తో సంబంధము లేకుండా ప్రతి ఒక్కరిని స్వాతంత్ర పోరాటంలో భాగస్వాములను చేసి దేశ ప్రజలందరికీ జాతిపితగా గౌరవం పొందిన మహాత్ముడు గాంధీ అని అన్నారు. ఈ కార్యక్రమంలో టిపిసిసి కన్వీనర్ జేబీ శౌరి, 29వ వార్డు కౌన్సిలర్ తంగళ్ళ లక్ష్మణ్, గరిపేట ఎంపీటీసీ కసనబోయిన భద్రం కోయగూడెం ఉప సర్పంచ్ బండ శ్రీను మైనార్టీ జిల్లా నాయకులు ఎండి గౌస్ మొయినుద్దీన్, పట్టణ కాంగ్రెస్ నాయకులు స్టీవెన్ లాజరస్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు గడ్డం రాజశేఖర్ గుంటి రామచందర్ రుక్మిణి యువజన కాంగ్రెస్ అధ్యక్షులు ఎండి దావూద్ గండ్ల సురేష్ వి నరసింహ రావు జక్కం యేసు తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: