గుండాల/ఆళ్లపల్లి సెప్టెంబర్ 1 (మన్యం మనుగడ) గిరిజనులకు 10% రిజర్వేషన్ల పెంపు చారిత్రాత్మక నిర్ణయమని టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పాయం నరసింహారావు అన్నారు. శనివారం మండలం పరిధిలోని మర్కోడ్ గ్రామపంచాయతీ కార్యాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. పెంపు నిర్ణయాన్ని రాష్ట్రంలోని గిరిజనులు స్వాగతిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ కు మండల గిరిజనుల తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నట్టు ఆయన పేర్కొన్నారు. పెంచి వదిలేయడమే కాకుండా ఆచరణలో భాగంగా జీవోను విడుదల చేసి గిరిజనులకు అండగా ముఖ్యమంత్రి నిలిచారని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పిఎసి చైర్మన్ రామయ్య, పార్టీ ప్రధాన కార్యదర్శి బాబా, ఉపాధ్యక్షులు వెంకటేశ్వర్లు, బుర్ర వెంకన్న, సర్పంచులు శంకర్ బాబు, నరసింహారావు, యువజన విభాగం అధ్యక్షులు సతీష్ , ఎండి ఆదాం, ఆరిఫ్ తదితరులు పాల్గొన్నారు
Navigation
Post A Comment: