మన్యం మనుగడ, మంగపేట:
ములుగు జిల్లా అధ్యక్షులు, జడ్పీ చైర్మన్ మరియు నియోజకవర్గ ఇన్చార్జి కుసుమ జగదీశ్వర్ ఆదేశాల మేరకు మంగపేట మండల పార్టీ అధ్యక్షులు శ్రీ కుడుముల లక్ష్మినారాయణ ఆధ్వర్యంలో మంగపేట మండలంలోని బుచ్ఛంపేట రెషన్ షాపు వద్ద శనివారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి మంజూరైన దసరా పండుగ కానుకగా బతుకమ్మ సంబరాల చీరలను రేషన్ లబ్ధిదారులైన పలువురు మహిళల కు పిఏసిఎస్ డైరెక్టర్ చిట్టి మల్ల రజిత సమ్మయ్యమరియు డీలర్ జబ్బ కవిత పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పిఏసిఎస్ డైరెక్టర్ మాట్లాడుతూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తర్వాత సీఎం కే.సీ.ఆర్ నాయకత్వంలో రాజకీయాలకు, కులమతాలకు తావు లేకుండా అన్ని వర్గాల వారికి సంక్షేమ పథకాలు అందుతున్నాయని అన్నారు. ప్రతి ఇంటికి ఏదో ఒక విధంగా సంక్షేమ ఫలాలు అందించిన ఘనత ఒక సీ.ఎం కే.సీ.ఆర్ కే దక్కుతుందని అన్నారు, బతుకమ్మ పండుగ కానుకగా ఆడబిడ్డలకు చీరలను అందిస్తున్నట్లు తెలిపారు. మహిళల కోసం ఎన్నో పథకాలు అమలు చేస్తున్నట్లు వివరించినారు ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్లు,మరియు తెరాస గ్రామ కమిటీ అధ్యక్షుడు ప్రధానకార్యదర్శి బూరుగుల వేంకటమల్లు,మందల ఉప్పలయ్య, మండల బీసీ సెల్ ఉపాధ్యక్షుడు నక్క యాకయ్య, మండల రైతు కమిటీ ఉపాధ్యక్షుడు సామ మల్లారెడ్డి,తెరాస గ్రామ మహిళ అధ్యక్షురాలు సామ రేణుక, రైతు కోఆర్డినేటర్ పన్నాల కొండలరెడ్డి,హేమలత, మండల యూత్ ఉపాధ్యక్షులు మండల రమేష్, సామ యుగందర్ రెడ్డి,కొంపెల్లి ముకుందరెడ్డి,ఎర్ర వెంక్కన్న ,పాన్నాల నాగిరెడ్డి,ఎర్ర సైదులు,రాచకొండ వెంకటయ్య,పిట్టల సాంబయ్య,కాసోజు వెంకన్న, మహిళలు,గ్రామస్తులు,తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: