మన్యం మనుగడ ప్రతినిధి చండ్రుగొండ : గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారం అందించాలని ఐసిడిఎస్ సూపర్వైజర్ రాణి అన్నారు. బుధవారం తిప్పనపల్లి గ్రామంలో గల అంగన్వాడి కేంద్రంలో గర్భిణీలకు శ్రీమంతాలు, చిన్నారులకు అన్నప్రసన, అక్షరాభ్యాసం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బరువు తక్కువగా ఉన్న చిన్నారులకు ప్రత్యేక పౌష్టికాహారాన్ని అందించాలన్నారు. రక్తహీనత సమస్య తలెత్తకుండా తాజాపండ్లు కూరగాయలను, ఆహారంగా స్వీకరించాలన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ లంకా విజయలక్ష్మి, అంగన్వాడి టీచర్లు భారతమ్మ, సునీత, కృష్ణవేణి, మంజుల, ఉపేంద్ర, తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: