మన్యం మనుగడ, పినపాక: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలంలోని కొన్ని పంచాయతీలలో తెలంగాణ ప్రభుత్వం వయసు పైబడిన, ఒంటరి మహిళ, వితంతు, వికలాంగులైన ప్రజానీకం కోసం ఆసరా కార్డులను నూతనంగా మంజూరు చేసింది. మండల వ్యాప్తంగా 1000 కి పైగా ఆసరా కార్డుల పంపిణీ జరిగింది. ఈ కార్డుల పంపిణీలో అధికారులు చేతివాటం ప్రదర్శించారు. నూతనంగా మంజూరైన కార్డులు అర్హులకు ఇచ్చే క్రమంలో వెయ్యి రూపాయలను వసూలు చేశారు. విషయమై "మన్యం మనుగడ" ప్రశ్నించగా, కొంతమంది వారి సంతోషం కొలది ఇచ్చారని అధికారులు తెలియజేస్తున్నారు. మరి కొంతమంది వద్ద నుండి తీసుకున్నామని తెలియజేశారు. ఇదే విషయమై మండల అభివృద్ధి అధికారి శ్రీనివాసులు ను "మన్యం మనగడ" వివరణ కోరగా ఆసరా కార్డుల కోసం డబ్బులు వసూలు చేసిన వారిని వదిలేది లేదని, పై అధికారులకు వెంటనే తెలియపరుస్తామని తెలియజేశారు.
Navigation
Post A Comment: