మన్యం మనుగడ ,పినపాక: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత డాక్టర్ కాళోజి నారాయణరావు జయంతి వేడుకలు ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి కళాశాల ప్రిన్సిపాల్ శేషు బాబు అధ్యక్షత వహించడం జరిగింది. ఈ సమావేశంలో కాళోజి నారాయణరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది . అలాగే ఈ సమావేశంలో కాలోజి నారాయణరావు జీవిత విషయాలను కూలంకషంగా వివరించారు. అలాగే కళాశాల అధ్యాపకులు కూడా కాలోజి నారాయణరావు జీవిత విశేషాలను, అతని యొక్క గొప్పతనాన్ని విద్యార్థులకు సూచించడం జరిగింది. వారి యొక్క సూచనలను పాటిస్తే విద్యార్థులు కూడా భవిష్యత్తులో ఉన్నత స్థాయికి వెళ్లగలరని ఆకాంక్షించడం జరిగింది. ఈ సమావేశంలో అధ్యాపకులు, సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: