మన్యం టివి, మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు గురువారం నాడు మణుగూరు మండల దివ్యాంగుల సేవా సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా దివ్యంగుల సేవా సంఘం ఆధ్వర్యంలో వారు ఎదుర్కొంటున్న పలు రకాల సమస్యలపై వారు విప్ రేగా కాంతారావు కు వినతి పత్రం అందజేయడం జరిగింది. సమస్యల విప్ రేగా స్పందిస్తూ, సమస్యల పరిష్కారానికి కృషిచేసి,ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తానని వారు తెలియజేశారు.ఈ సందర్భంగా ఆయన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,రేగా కాంతారావు మాట్లాడుతూ, రాష్ట్రంలో ఎక్కడలేని విధంగా తెలంగాణలో దివ్యాంగులకు రూ.3016 వేల పింఛన్ అందిస్తున్న ఏకైక వ్యక్తి సీఎం కేసీఆర్,టీఆరెఎస్ ప్రభుత్వం అని తెలిపారు.తెలంగాణ ప్రభుత్వం అన్ని వర్గాలతో పాటుగా దివ్యాంగులను కూడా అన్ని విధాలుగా ఆదుకుంటామని ఆయన అన్నారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్మాత్మకంగా అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలను అందరూ సద్వినియోగం చేసుకోవాలని వారు సూచించారు. ఈ కార్యక్రమం లో మండల దివ్యాంగుల సేవా సంఘం సభ్యులు,టీఆరెఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: