CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

దళిత బంధు ద్వారా దళితుల సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం కృషి చేయాలి మాల మహానాడు రాష్ట్ర ప్రచార కార్యదర్శి పల్లికొండ యాదగిరి

Share it:


మన్యం మనుగడ, మంగపేట. : ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనులతో పాటు పూర్వ నుండి సహా జీవనం చేస్తున్న ఏజెన్సీ దళితులకు ప్రతి కుటుంబానికి దళిత బంధు ఇవ్వాలని ప్రభుత్వాన్ని  కోరుతున్నట్లు మాలమహానాడు రాష్ట్ర ప్రచార కార్యదర్శి పల్లి కొండ యాదగిరి అన్నారు.దళితులు వెనుకబాటుకు ప్రధాన కారణం ఏజెన్సీ లో నివసించటం వలన అభివృద్ధి కి ఆమడ దూరం లో ఉన్నారని, ఏజెన్సీలో నివసిస్తున్నప్పటి నుండి ఇప్పటి వరకు అడవులు తరిగి పోయి అడవుల మీద, వాటి ప్రతి ఫలాలు మీద ఆధారపడిన దళిత కుటుంబాలు రోజు వారీ కూలీలుగా మారారని, రోజులు మారాయి కానీ దళితుల జీవితాలు మారలేదు దళితుల కుటుంబాలు దయనీ యమైన పేదరికంలో నివసిస్తు న్నారని ఈ విషయం రాష్ట్ర ప్రభుత్వం గ్రహించి ప్రతి ఒక్క కుటుంబానికి ఒక్కో యూనిట్ చొప్పున దళిత బంధు ప్రకటించి దళిత కుటుంబాల జీవితాలలో వెలుగులు నింపాలని ప్రభుత్వం భావించి దళిత బందు పథకం ప్రవేశ పెట్టిందని ఏజెన్సీ ఏరియాలో ఉన్న దళితులకుదళిత బంధు ఇవ్వొద్దు అనకుండా ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న దళితులకు కుడా దళిత బందు వచ్చే విదంగా అన్ని సామజిక వర్గాలు కూడా సహాయ సహకారాలు అందించాలని కోరారు.ఆదివాసులను దోచుకున్న చరిత్ర కానీ వారిపై ఆధిపత్యం చేసిన చరిత్ర గాని దళితులకు లేవని ఆదివాసి ప్రాంతాలలో జీవిస్తున్న దళితులకు ఏజెన్సీ చట్టాల రూపక ల్పంలోనే అన్యాయం జరిగిందని ఆదివాసి సోదరులకు ఏజెన్సీ దళితుల పట్ల సానుభూతి సోదర భావం ప్రేమ కలిగి ఉండాలి తప్ప శత్రు వులగా పరిగణించి ఆదివాసి చట్టాలకు వ్యతిరేక శత్రువు లుగా చిత్రీకరించొద్దని తెలంగాణ మాల మహానాడు తరపున విజ్ఞప్తి చేస్తున్నామని తెలిపారు.

Share it:

TELANGANA

Post A Comment: