CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

దేవుడి ఆశీర్వాదాలు ఉంటే నా జీవితాంతం పేదలకోసమే పాటుపడతా బాడిశ రమేష్

Share it:


మన్యం మనుగడ, మంగపేట.:

మంగపేట మండలం రమణక్కపేట గ్రామానికి చెందిన పలు నిరుపేద కుటుంబాలకు చెందిన వారికి శ్రీ రామకృష్ణ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆర్థిక సహాయాన్ని అందజేయడం జరిగింది. నిరుపేద కుటుంబానికి చెందిన రావుల శ్రీను,అతని భార్య ఇటీవలఅనారోగ్యం తో మృతి చెందగా వారికీ 10 నెలల చిన్న పాప దీక్షిత కు పాలు లేక ఇబ్బంది పడుతుంది ఈ విషయం తెలుసుకున్న శ్రీరామకృష్ణ సేవా ట్రస్ట్ చైర్మన్ బాడిశ నాగ రమేష్,ఆ పాపకు 2  నెలలకు సరిపడ పాల పౌడర్ డబ్బాలను అందజేశారు. పాప దీక్షితకు ఎటువంటి సహాయం అయినా తాను చూసుకుంటాను అని  తెలిపారు. ఇదే గ్రామానికి చెందిన చీమల పుల్లయ్య అనే వృద్ధుడు తీవ్ర అనారోగ్యంతో మంచానికే గత కొద్ది కాలంగా పరిమితమయ్యాడు అతని కుటుంబాన్ని కలిసి ఆరోగ్యం వివరాలు తెలుసుకొని అతని కుటుంబానికి 2500/- రూపాయలు అందజేశారు,గ్రామానికి చెందిన చదలవాడ ఫకీరయ్య ఇటీవల అనారోగ్యంతో చనిపోయాడు వారి కుటుంబాన్ని కలిసి పరామర్శించి దశ దిన కర్మల నిమిత్తం 25 కేజీల బియ్యాన్ని, 1500 రూపాయల ఆర్థిక సహాయాన్ని శ్రీ రామకృష్ణ సేవ ట్రస్ట్ చైర్మన్ నాగ రమేష్ అందజేశారు. ఈ సందర్బంగా శ్రీ రామకృష్ణ సేవా ట్రస్ట్ ప్రధాన సభ్యులు బాడిశ రమేష్ మాట్లాడుతూ దేశంలో 50 శాతం మంది పేద ప్రజలు ఉన్నారు, అందులో కొందరు అతి దీన పరిస్థితి లో ఉన్నారు,వారందరికీ మేము సహాయం చేయకపోవచ్చు కానీ మన పరిధిలో ఆపదలో ఉన్నప్రతి ఒక్కరికి సహాయం అందించాలనే తపన నాలో ఉంది,ఆలోచన రావడమే ఆ ఆలోచనను ఆచరణ లో పెట్టాము, అలా మొదలైన శ్రీ రామకృష్ణ సేవా ట్రస్ట్ ఇప్పటికి ఎంతో మందికి కి సహాయం అందించింది, ఇది ఏ ఒక్కరి వాళ్ళ సాధ్యం అయ్యేది కాదు, మనం అందరం కలిసి చేసిన,అందించిన సేవలు, మీరు ఎల్లప్పుడూ నాతో ఉంటే, దేవుని ఆశీర్వాదాలు నాపై ఉంటే ఇంకా ఎంతో మందికి ఈ సేవలు ఆదించాలని ఉందని ఈసందర్బంగా తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ట్రస్టు సభ్యులు బాడిష నవీన్, బాడిష ఆదినారాయణ, ఇందారపు రమేష్ ,బోడ ప్రవీణ్, గట్టుపల్లి అర్జున్, కనుకుంట్ల నాగరాజు, చెట్టుపల్లి రామకృష్ణ ,కర్రి చందు, గుగ్గిళ్ళ సురేష్, చౌలం సాయిబాబు, జయరాజ్, శ్రావణ్ కుమార్ మరియు రమణక్కపేట గ్రామస్తులు పయ్యావుల బాబురావు, సత్యనారాయణ మునిగల మహేష్, మంచాల నాగేంద్ర బాబు, స్నేహ కుమార్, గంగెర్ల నాగరాజు,లక్కమల్ల వెంకటేష్, చిట్యాల బాలు, ఓదెల సుధీర్ ,మునిగల విష్ణు, తరుణ్, కిషోర్ ,లోకేష్, ఎలమందరావు వంశీ తదితరులు పాల్గొన్నారు

Share it:

TELANGANA

Post A Comment: