మన్యం మనుగడ ప్రతినిధి, చండ్రుగొండ: దేవీ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా గురువారం శాకంబరిదేవి అవతారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. వేద పండితులు బి వి ఆర్ కె మూర్తి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తులకు అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. ప్రత్యేక పూజా కార్యక్రమంలో జిల్లా రైతుబంధు సమితి కన్వీనర్ అంకిరెడ్డి కృష్ణారెడ్డి, వైస్ ఎంపీపీ నరుకుళ్ల సత్యనారాయణ, టిఆర్ఎస్ జిల్లా నాయకులు మాలోత్ బోజ్య నాయక్ లు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. శుక్రవారం నాడు ఆలయంలో కుంకుమ పూజలు నిర్వహిస్తున్నట్లు వేద పండితులు కృష్ణమూర్తి తెలిపారు. మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
Navigation
Post A Comment: