CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

సుగంధ పంటల రైతులకు చేయూతనివ్వండి....

Share it:

 


సుగంధ పంటల రైతులకు చేయూతనివ్వండి....


 _ఏటూరు నాగారం కేంద్రంగా శీతల గిడ్డంగి నిర్మాణానికి రాయితీలు మంజూరు చేయాలి


 _మిర్చి రైతుల కోసం ప్రత్యేక పథకాలు అమలు చేయండి.


 జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ కమిటీ డైరెక్టర్ నాసిరెడ్డి సాంబశివరెడ్డి....


మన్యం మనుగడ, మంగపేట.

మిర్చి రైతులను ఆదుకునేందుకు జాతీయ సుగంధ ద్రవ్యాల అభివృద్ధి సంస్థ స్పైసేస్ బోర్డు నుండి ప్రత్యేక పథకాలు అమలు చేయాలని జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ కమిటీ డైరెక్టర్ నాసిరెడ్డి సాంబశివరెడ్డి వరంగల్ ప్రాంతీయ కార్యాలయం స్పైసెస్ బోర్డు సహాయ సంచాలకులు శ్రీమతి విధ్యుస్త్న కు విజ్ఞప్తి చేశారు. కేరళ రాష్ట్రానికి చెందిన శ్రీమతి విద్యుస్ట్న  స్పైసెస్ బోర్డు వరంగల్ రీజనల్ అసిస్టెంట్ డైరెక్టర్ గా కార్యాలయంలో బాధ్యతలు చేపట్టిన సందర్భంగా మర్యాద పూర్వకంగా బుధ వారం సాంబశివరెడ్డి భేటీ అయ్యారు పుష్పగుచ్చాన్ని అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం మిర్చి పసుపు రైతులు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై లేఖను అందజేశారు ఈ సందర్భంగా మిర్చి పసుపు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు స్పైసెస్ బోర్డు నుండి అమలవుతున్న పథకాలు రావాల్సిన నిధులు నిర్వహించవలసిన కార్యక్రమాలు పలు అంశాలను చర్చించారు. వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ లో  స్పైసెస్ బోర్డు ఆధ్వర్యంలో ల్యాబ్ ని మంజూరు చేయాలని అదేవిధంగా ములుగు జిల్లా ఏటూరు నాగారం గోదావరి పరివాహక ప్రాంతంలో నాణ్యమైన మిర్చి ఉత్పత్తి అవుతున్నందున ఏటూరు నాగారం మండల కేంద్రంలో రాయితీపై ఎంఐడిపీ శాఖ ద్వారా శీతల గిడ్డంగి నిర్మించేందుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు మిర్చి పసుపు రైతులకి ఐపిఎం కిట్స్ మరియు పంట కోత అనంతర యాజమాన్యంలో భాగంగా పరదాలు మరియు డ్రయింగ్ ప్లాట్ ఫామ్ లు మంజూరు చేయాలని కోరారు మిర్చి పసుపు రైతులకు కాలానుగుణంగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రణాళిక రూపొందించాలని కోరారు. ఎగుమతి దారుల కోసం స్పైసెస్ బోర్డు తో పాటు ఫిట్ సి సంస్థతో కలిసి పని చేసేందుకు అనుగుణంగా ఉత్పత్తి మరియు వినియోగదారులను ప్రోత్సహించాలని కోరారు. సమస్యలు విన్న  స్పైసెస్ బోర్డు ఏడి విద్యుస్ట్న భారత ప్రభుత్వం కామర్స్ మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు నిధుల కేటాయింపు ని అనుసరించి పథకాలను అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్పైసెస్ బోర్డ్ సిబ్బంది జోసెఫ్ శ్యామ్ముల్ సాగర్ తదితరులు పాల్గొన్నారు

Share it:

TELANGANA

Post A Comment: