గుండాల/ఆళ్లపల్లి సెప్టెంబర్ 18(మన్యం మనుగడ) తెలంగాణ రాష్ట్రంలో ఎస్టీలకు 10 శాతం రిజర్వేషన్ పెంపు ముఖ్యమంత్రికి కెసిఆర్ చారిత్రాత్మక నిర్ణయమని టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పాయం నరసింహారావు అన్నారు. ఆదివారం మండలం పరిధిలోని మార్కోడు గ్రామపంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ. ఎన్నో ఏండ్లుగా ఎదురుచూస్తున్న రిజర్వేషన్ల పెంపు నిర్ణయం ప్రకటించడం ఆనందంగా ఉందన్నారు. పోడు భూములకు పట్టాల నిర్ణయంతో పాటు భూమిలేని గిరిజనులకు గిరిజన బందు అమలు చేస్తామరడం ఆనందంగా ఉందని వారు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలోనే అన్ని వర్గాల ప్రజలను సమానంగా చూస్తున్నారని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి హనుమంతరావు, పిఎసిఎస్ చైర్మన్ రామయ్య, పార్టీ ఉపాధ్యక్షులు, సర్పంచులు శంకర్ బాబు, సత్యనారాయణ, నాయకులు శ్రీను, వెంకన్న, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు
Navigation
Post A Comment: