CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పౌష్టిక ఆహారంతో పిల్లల్లో ఆరోగ్యం.

Share it:


 మన్యం మనుగడ వాజేడు సెప్టెంబర్ 9. :   రాష్ట్రంలో పోషకాహార లోపాన్ని అరికట్టేందుకు సెప్టెంబర్‌ మాసంలో పోషణ మాసోత్సవాన్ని తెలంగాణ ప్రభుత్వం జరుపుతుంది. ఈ పోషణ మాసోత్సవంలో పోషకాహార లోపం ఉన్న చిన్నారులను, గర్భిణులను గుర్తించి సాధారణ స్థితికి తీసుకురావడానికి, పోషణ మాసోత్సవ నిర్వహణ కోసం వాజేడు మండలం ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో మాహిళా, శిశుసంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి, జడ్పిటిసి తలన పుష్పలత, ఎంపీపీ శ్యామల శారద, హాజరై ఈ సందర్భంగా మాట్లాడుతూ… భారతదేశంలో 21కోట్ల మంది పోషకాహార లోపంతో బాధపడుతున్నారని, రాష్ట్రంలో దానిని అరికట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు. పోషణమాసోత్సవంలో పోషకాహార లోపంతో బాధపడుతున్న చిన్నారులు, గర్భిణులను గుర్తించి వారికి పోషకాహారాన్ని అందించాలన్నదే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యమని తెలిపారు. మహిళల్లో పోషకాహార లోపం అనేక అనార్ధాలకు దారితీస్తున్నదని, దీనివల్ల వారికి పుట్టబోయే శిశువులు సైతం అనేక లోపాలతో జన్మిస్తున్నట్లు చెప్పారు. పోషకాహార లోపం లేకుండా తగు జాగ్రత్తలు పాటిస్తే శిశుమరణాలను సైతం అరికట్టవచ్చన్నారు. మహిళలు, శిశువుల్లో పోషకాహార లోపం నుండి సాధారణ స్థితికి తీసుకురావడానికి మహిళా, శిశు సంక్షేమశాఖ, సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో విజయ, ఎమ్మార్వో గూడూరి లక్ష్మణ, సిడిపిఓ ముత్తమ్మ, డాక్టర్ శౌర్య, సి హెచ్ ఓ, అంగన్వాడి సూపర్వైజర్ రమాదేవి, అంగన్వాడీ టీచర్స్ గర్భిణీలు,బాలింతలు, తదితరులు పాల్గొన్నారు.

Share it:

CINEMA

TELANGANA

Post A Comment: