మన్యం మనుగడ, పినపాక: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం గోవిందాపురం గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో పోషణ మాసోత్సవాలు జరిగాయి. ఈ సందర్భంగా పినపాక సెక్టార్ సూపర్వైజర్ సత్యవతి పాల్గొని, పోషణ మాసోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలు, బాలింతలు అంగన్వాడీ కేంద్రంలో ఇచ్చే పౌష్టిక ఆహారాన్ని తీసుకోవడం వలన కలిగే లాభాలను గురించి వివరించారు. ఎదుగుతున్న పిల్లలకు బాలామృతం తినిపించడం వలన కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్ కావాల్సిన మోతాదులో పిల్లలకు అందుతాయి అని తెలియజేశారు. ఆకుకూరలు కూరగాయల వలన ఆరోగ్యకరంగా ఉండి ఎల్లప్పుడూ ఉత్సాహంగా ఉంటారని తెలియజేశారు. అంగన్వాడి అందించే పోషకాహారం గురించి లోగోను చక్కగా తీర్చిదిద్దడం జరిగింది. ఈ కార్యక్రమంలో గోవిందాపురం అంగన్వాడీ కార్యకర్త సుజాత, తోగూడెం అంగన్వాడీ కార్యకర్త అనంతలక్ష్మి, గోపాలరావుపేట అంగన్వాడీ కార్యకర్తలు శారద, స్వరూప, టేకులగూడెం అంగన్వాడీ కార్యకర్త చంద్రకళ, ఆయా గొగ్గల నాగేశ్వరి, ఆశా కార్యకర్త గొగ్గల సుశీల, గర్భిణీ స్త్రీలు, బాలింతలు, పిల్లలు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: