CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

జ్వరాలతో బాధ పడుతున్న ప్రజలకు పండ్లు పంపిణీ చేసిన బీఎస్పీ నాయకులు

Share it:


మన్యం మనుగడ, మంగపేట.

మంగపేట మండలం రాజుపేట ఎస్సీ కాలనీ ప్రజలు గత రకొన్ని రోజులుగా  25 కుటుంబాలకు పైగా మలేరియా, డెంగ్యూ, టైపాయిడ్ లాంటి విష జ్వరాల బారిన పడి తీవ్ర ఇబ్బందులు పడుతున్నవిషయం తెలుకున్న బిఎస్పీ నాయకులు జిల్లా మహిళా కన్వీనర్ గుంతపూడి తిరుమల, అసెంబ్లీ జనరల్ సెక్రటరీ జై భీమ్ రామ్మోహన్ ఆధ్వర్యంలో బాధితులకు పండ్లు పంపిణీ చేయడం జరిగింది.తదనంతరం అసెంబ్లీ జనరల్ సెక్రెటరీ జై భీమ్ రామ్మోహన్ మాట్లాడుతూ విష జ్వరాల బారిన పడిన బాధితులకు ప్రభుత్వం మెరుగైన వైద్యం అందించి, జనం నివాసం ఉండే పరిసర ప్రాంతాల్ల చుట్టూ గ్రామపంచాయతీ సిబ్బందితో బ్లీచింగ్ పౌడర్ మరియు దోమల నివారణకై స్ప్రే చేయించాలని,      బిఎస్పి అసెంబ్లీ జనరల్ సెక్రెటరీ జై భీమ్ రామ్మోహన్ డిమాండ్ చేశారు.. ప్రజలకు కావలసిన కనీస వసతులు,ఉచిత వైద్యం,ఉచిత విద్య ప్రభుత్వం అందించాలని, దానికి అధికారులు కూడా సహకరించాలని, ప్రజల ఆరోగ్యం పట్ల ఇంత అలసత్వం పనికిరాదని, ప్రభుత్వం అంటే ప్రజలేనని, అటువంటి ప్రజల శ్రేయస్సు కోరి ప్రభుత్వాలు పని చేయాలని, ఈ విషయంలో అధికారులు క్షేత్ర స్థాయిలో పనిచేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో కుర్సం చిరంజీవి, సున్నం నర్సింగరావు, బేత వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: