గుండాల, సెప్టెంబర్ 23(మన్యం మనుగడ): ప్రజల రక్షణతో పాటు వారి సమస్యల సాధనలో ఎల్లవేళలా ముందు అడుగులో ఉంటామని ఇల్లందు డిఎస్పి రమణమూర్తి అన్నారు. శుక్రవారం మండలం పరిధిలోని ముత్తాపురం గ్రామంలో ప్రజలతో ఆయన కొద్దిసేపు ముచ్చటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తమ గ్రామ సమస్యలను పోలీసువారికి తెలియపరచినట్లయితే సాధ్యమైనంత వేర వాటిని పరిష్కరించే విధంగా కృషి చేస్తామని ఆయన అన్నారు. గ్రామాల్లో అనుమానిత వ్యక్తులు ఎవరైనా సందర్శిస్తే పోలీస్ శాఖ వారికి తెలియపరచాలని అన్నారు. ప్రజల రక్షణ దేయంగా పోలీస్ శాఖ పనిచేస్తుందని అన్నారు. మావోయిస్టులకు ప్రజలు ఎవరు సహకరించవద్దని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో గుండాల సీఐ కరుణాకర్, ఎస్సై కిన్నెర రాజశేఖర్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు
Navigation
Post A Comment: