గుండాల/ఆళ్లపల్లి , సెప్టెంబర్ 13(మన్యం మనుగడ) : పోడు రైతుల స్వప్నాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ నెరవేర్చారని టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పాయం నరసింహారావు , ఎంపీపీ మంజు భార్గవి అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం వద్ద ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రభుత్వ విప్ రేగా కాంతారావు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఎన్నో ఏండ్లుగా పోడు రైతులు ఎదురుచూస్తున్న కల స్వప్నం చేసిన ముఖ్యమంత్రికి ధన్యవాదాలు అన్నారు. అనంతరం మండల కేంద్రంలో జిసిసి పక్కన బతుకమ్మ ఘాటు కోసం భూమిని రేగా చొరవతో ప్రభుత్వం కేటాయించింది ఆ స్థలాన్ని ప్రజాప్రతినిధులు పార్టీ నాయకులతో కలిసి వారు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ అధ్యక్షులు రామయ్య, పార్టీ ప్రధాన కార్యదర్శి బాబా, ఉపాధ్యక్షులు వెంకటేశ్వర్లు, టిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
Navigation
Post A Comment: