జూలూరుపాడు, సెప్టెంబర్ 24, (మన్యం మనుగడ ప్రతినిధి): తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక "బతుకమ్మ పండుగ" సందర్భంగా శనివారం మండల పరిధిలోని అనంతారం, కాకర్ల సర్కార్ బడులలో విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయులు, ప్రజా ప్రతినిధులు బతుకమ్మ పండుగ వేడుకలను ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అనంతరం సర్పంచ్ యదళ్ళపల్లి కళాశ్రీ, రైతు బంధు మండల కన్వీనర్ యదళ్ళపల్లి వీరభద్రం, అనంతారం పాఠశాల ప్రధానోపాధ్యాయులు బానోతు వస్రాం, పాఠశాల ఎస్ఎంసి చైర్మన్ రమేష్, పంచాయతీ కార్యదర్శి మల్లికా తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: