CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

దళిత బంధు పథకం దళితులకు అండ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ రేగా కాంతారావు

Share it:


మన్యం మనుగడ ప్రతినిధి, అశ్వాపురం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం లోని చింతి ర్యాల కాలనీకి గ్రామానికి చెందిన తైదల శివరాములు ల ఆటోమొబైల్ షాప్ , మరియు కళ్యాణపురం గ్రామానికి చెందిన యన్న సంగీతరావు ల సంగీత రావు సెంట్రింగ్ వర్క్ కులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్మాత్మకంగా అమలు చేస్తున్న దళిత బంధు పథకంలో భాగంగా మంజూరైన నిధులతో ఏర్పాటు చేసుకున్న షాప్ లను ముఖ్యఅతిథిగా హాజరై రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్  పినపాక శాసనసభ్యులు  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు  రేగా కాంతారావు.ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ శ్రీ రేగా కాంతారావు  మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో దళితుల సమగ్ర అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్  దళిత బంధు పథకాన్ని అమల్లోకి తీసుకువచ్చారని అన్నారు.75 ఏళ్ల స్వాతంత్ర భారత దేశంలో దళిత బంధు పథకం లాంటి పథకం తెలంగాణ రాష్ట్రంలో తప్ప ఏ రాష్ట్రంలో అమల్లోకి రాలేదు అన్నారు.రాష్ట్రంలో దళితులకు అసమానతలు రూపుమాపడానికి, దళిత సమాజాన్ని ఆర్థికంగా పురోగతిలకు తీసుకురావడానికి సీఎం కేసీఆర్  ప్రతిష్ణాత్మకంగా దళిత బంధు పథకం ప్రవేశపెట్టారు అన్నారు, రాష్ట్రంలో అమలవుతున్న దళిత పథకంతో ప్రతిపక్షాలు పునాదులు కదులుతున్నాయన్నారు, రాజకీయ లబ్ధి కోసమే బిజెపి పార్టీలు కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నాయని అన్నారు, దళిత బంధు పథకం ద్వారా వచ్చే ఏడేళ్లలో 70 వేల కోట్ల నిధులతో 18 లక్షల దళిత కుటుంబాలు లబ్ధి పొందుతాయన్నారు.రాజకీయాల కతీతంగా దళిత బంధు పథకం అమలు చేస్తున్నామన్నారు.పినపాక నియోజకవర్గం లో ఉన్న ప్రతి దళిత కుటుంబాలకు దళిత బంధు పథకం తప్పకుండా అందుతుంది అన్నారు.సీఎం కేసీఆర్  ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన ఉపాధ్యాయులను నియమించి నాణ్యమైన భోజనాన్ని అందించడంతోపాటు సహకార సదుపాయాలు కల్పిస్తున్నారు అన్నారు.పేదలంతా కూడా బాగా చదువుకుంటే తప్ప దేశం మారదని ముఖ్యమంత్రి కేసీఆర్  ఎన్నో కార్యక్రమాలను చేపడుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ సూదిరెడ్డి సులక్షణ రెడ్డి, వైస్ ఎంపీపీ కంచు గట్ల వీరభద్రం, మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కోడి అమరేందర్, పినపాక నియోజకవర్గం ఎస్సీ సెల్ అధ్యక్షులు వెన్న అశోక్ కుమార్, పినప్ప నియోజకవర్గ యువజన విభాగం ఉపాధ్యక్షులు లంకెల రమేష్, టిఆర్ఎస్ పార్టీ మండల మహిళా అధ్యక్షురాలు తోకల లత, ఎంపీటీసీలు, సర్పంచులు, వార్డు మెంబర్లు,మండల టిఆర్ఎస్ పార్టీ నాయకులు, మండల యువజన విభాగం నాయకులు, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు, సోషల్ మీడియా సభ్యులు, గ్రామ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: