మన్యం మనుగడ,పినపాక:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలంలోని ఏడూల్ల బయ్యారం క్రాస్ రోడ్ లో ఆదివాసి నాయకుల ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ, పోడు భూముల పట్టాల కొరకు జి ఓ నెంబర్ 140 , గిరిజన బందు కొరకు కృషి చేసిన ఆదివాసీ ఎమ్మెల్యేలకు, పినపాక మండల ఆదివాసీ సంఘాల తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అన్నారు. ఈ విషయం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ అభినందనీయుడు అని, ఆదివాసీల పట్ల ఆయనకు గల ప్రేమకు వందనం అని అన్నారు. హైదరాబాద్ బంజారా హిల్స్ లో కొమరం భీమ్ కమిటిహాల్ ప్రారంభోత్సవం కార్యక్రమంలో గిరిజన బందు ప్రకటించడంతో గిరిజనలు హర్షం వ్యక్తం చేస్తున్నారని, అన్ని వర్గాల ప్రజానీకానికి సమన్యాయం పాటించడం ఒక టిఆర్ఎస్ పార్టీకే సాధ్యమైందని తెలియజేశారు . ఈ సందర్భంగా పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే రేగా కాంతారావుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సమావేశంలో గొగ్గలి ఆర్కేదొర, కొమర వెంకటేశ్వర్లు, తోలెo శ్రీనివాస్ , సోలం వినయ్ కుమార్, కురుసం సారయ్య, దనసరి నరసింహమూర్తి, కొమరం శ్రీను, సనప భరత్ లు పాల్గొన్నారు.
Post A Comment: