CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

మత్స్యశాఖ ఆధ్వర్యంలో చేప పిల్లల పంపిణీ

Share it:




మన్యం మనుగడ, పినపాక:


 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలంలోని సొసైటీ చెరువులకు, గ్రామపంచాయతీ చెరువులకు మత్స్యశాఖ ఆధ్వర్యంలో చేప పిల్లల పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పినపాక మండల ఎంపీపీ గుమ్మడి గాంధీ విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మత్స్యశాఖ ఆధ్వర్యంలో మండల వ్యాప్తంగా ఉన్న 27 చెరువులకు గాను 577500 చేప పిల్లలను పంపిణీ చేశామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ చైర్మన్ రవి వర్మ, ఆత్మ కమిటీ చైర్మన్ భద్రయ్య, పినపాక సర్పంచ్ గొగ్గల నాగేశ్వరరావు, భూపాలపట్నం సర్పంచ్ కృష్ణంరాజు, జిల్లా మత్స్యశాఖ అధికారి భానోత్ వీరన్న, రైతులు పాల్గొన్నారు.

Share it:

te

TELANGANA

Post A Comment: