CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

చేప పిల్లల పంపిణీ చేసిన అశ్వరావుపేట మండల ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామూర్తి

Share it:


మన్యం మనుగడ, అశ్వారావుపేట:  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మండలం అశ్వారావుపేట పంచాయతీలోని స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయం నందు మత్స్యశాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వం ఇచ్చే ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమం చేపట్టగా, ముఖ్య అతిథిగా పాల్గొన్న అశ్వారావుపేట మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు జల్లిపల్లి. శ్రీరామమూర్తి చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సంధర్బంగా అయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారులకు అండగా ఉంటూ ఉచిత వాహనాలు, అలాగే ఉచితంగా చేప పిల్లలు, వాటినీ పెంచేందుకు ఆహారం, అలాగే అవీ అమ్ముకోవటానికి కాటాలు, కూలింగ్ బాక్స్ లు, తదితర సామగ్రిను మత్స్యశాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వం ఉచితంగా అందిస్తుందని, వాటిలో భాగంగానే బుధవారం అశ్వారావుపేట మండల లో మొత్తం 50 చెరువులకు గాను, 6,21,000 చేప పిల్లలు వాటిలో బొచ్చులు -2,17,350, రోహు -2,17,350, బంగారు చెలకా -1,86,300 చేప పిల్లలను బుధవారం రోజు మత్స్య కారులకు ఆందజేయటం జరిగిందని అశ్వారావుపేట మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు జల్లిపల్లి. శ్రీరామమూర్తి తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ అట్టం రమ్య, సర్పంచులు సంఘం అధ్యక్షులు నారం రాజశేఖర్, గొందు లక్ష్మణ్ రావు, డీసీసీబీ డైరెక్టర్ నిర్మల పుల్లారావు, ఎంపిటిసి వేముల భారతి, ఈఓఆర్డి సీతా రామరాజు, మత్యశాఖ అధికారులు మంగరాజు, కలపాల. శ్రీనివాసరావు, గంధం వేంకటేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: