CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

డిగ్రీ ప్రవేశాలకు చివరి అవకాశం:డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ బి శ్రీనివాస్

Share it:


మన్యం టీవీ, మణుగూరు:  ఇంటర్,పాలిటెక్నిక్ డిప్లమా పూర్తి అయినా విద్యార్థులు డిగ్రీ ప్రవేశాల కోసం దోస్త్ రిజిస్ట్రేషన్ కు సెప్టెంబర్ 12 వరకు మాత్రమే అవకాశం ఉందని, ఇంటర్ పూర్తయిన విద్యార్థులు వెంటనే దోస్తు ద్వారా రిజిస్ట్రేషన్ చేయించుకుని డిగ్రీలో ప్రవేశం పొందవచ్చని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ బి శ్రీనివాస్ పత్రికా ప్రకటనలో తెలియజేశారు.ప్రభుత్వ డిగ్రీ కళాశాల మణుగూరు నందు అనేక రకాల సౌకర్యాలను కలిగిస్తూ,విశాలమైన కళాశాల గ్రౌండ్ కలిగి ఉండి,సాంస్కృతిక, క్రీడా రంగాలలో అద్భుతమైన ఫలితాలతో రాణిస్తున్న ప్రభుత్వ డిగ్రీ కళాశాల మణుగూరు నందు విద్యార్థులు చేరాలని కోరారు.డిగ్రీలో చేరదలుచుకున్న విద్యార్థులు వెంటనే ఒరిజినల్ సర్టిఫికెట్స్ తో కళాశాలలోని దోస్త్ కోఆర్డినేటర్ (8328258828) ను,దోస్త్ టెక్నికల్ అసిస్టెంట్ (9849868823) సంప్రదించి ప్రవేశం పొందవచ్చని తెలిపారు.సెప్టెంబర్ 12 వరకు మాత్రమే అవకాశం ఉందని తదుపరి ప్రవేశాలకు అవకాశం లేదని కావున విద్యార్థులు వెంటనే కళాశాల నందు సంప్రదించాలని కోరారు. కళాశాలలో బి.ఎ (ఇంగ్లీష్ మీడియం/ తెలుగు మీడియం),బి.కాం ఇంగ్లీష్ మీడియం, బీఎస్సీ ( ఎంపీసీ, ఎంపీసీఎస్), బిఎస్సి (బి జెడ్ సి) కోర్సులు అందుబాటులో ఉన్నాయి అని తెలిపారు. జాతీయస్థాయిలో నాక్ 'బి' గ్రేడ్ గుర్తింపు పొందిన కళాశాలలో విద్యార్థులు జాయిన్ అవ్వాలని కోరారు.

Share it:

TELANGANA

Post A Comment: