- జూలూరుపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు తప్పని అవస్థలు..
- తక్షణమే అదనపు డాక్టర్లను నియమించాలని కోరుతూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ముందు ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా ..
జూలూరుపాడు , సెప్టెంబర్ 6, (మన్యం మనుగడ ప్రతినిధి) : పేదలకు వైద్య సేవలు అందించడానికి కోట్ల రూపాయలు ఖర్చు చేసిన పేదోడికి వైద్యం అందే పరిస్థితిలో లేదని ఏఐవైఎఫ్ మండల అధ్యక్ష కార్యదర్శులు ఎస్ కె చాంద్ పాషా, పగడాల అఖిల్ విమర్శించారు. మంగళవారం ఏఐవైఎఫ్ మండల సమితి ఆధ్వర్యంలో జూలూరుపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద ధర్నా నిర్వహించారు. ధర్నా ను ఉద్దేశించి మాట్లాడుతూ.. 28 వేల మండల జనాభా, 24 గ్రామపంచాయతీలో ప్రజలు దాదాపు రోజుకి 100 నుంచి 150 మంది, రోగులు వైద్యం కోసం జూలూరుపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కు వస్తారని, గతంలో జూలూరుపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో ముగ్గురు డాక్టర్లు ఉండేవారని, డిప్యూటేషన్ పేరుతో ఇక్కడ పని చేస్తున్న వైద్యులను వేరే ప్రాంతానికి బదిలీ చేశారని, ప్రస్తుతానికి ఇక్కడ ఒక డాక్టర్ మాత్రమే ఉన్నారని, సీజనల్ వ్యాధులతో ప్రభుత్వాసుపత్రికి పెద్ద ఎత్తున సామాన్య ప్రజలు వైద్యం కోసం వస్తున్నారని అన్నారు. స్థానికంగా ఒకడాక్టర్ ఉండడం వల్ల రోగులకు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, వీరితోపాటు అదనపు సిబ్బంది కూడా లేకపోవడం వల్ల అనేక అవస్థలు పడుతున్నారని తెలిపారు. దాదాపు 5 లక్షల రూపాయలతో డెంటల్ పరికరాలు ప్రభుత్వం మంజూరు చేసిన, డెంటల్ డాక్టర్ లేకపోవటం వల్ల నిరుపయోగంగా ఉన్నాయని, డెంటల్ డాక్టర్ ను తక్షణమే నియమించాలని డిమాండ్ చేశారు. మండలంలో దాదాపు ఎనిమిది డెంగ్యూ కేసులు నమోదయాయని, 24 గ్రామపంచాయతీలో తక్షణమే హెల్త్ క్యాంపులు నిర్వహించాలని కోరారు. వైద్యులను కూడా నియమించాలని లేనిపక్షంలో పెద్ద ఎత్తున డి ఎం హెచ్ ఓ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నరసింహారావు, ఎస్కే సమీర్, మహేష్, కార్తీక్, వంశీ, వెంకటేష్, రాము, సురేష్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: