మన్యం టివి, దుమ్ముగూడెం::
మండలంలోని మారుమూల ఏజెన్సీ గ్రామంలో విజృంభిస్తున్న విష జ్వరాల దృష్ట్యా ఐటిడిఏ భద్రాచలం వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో కొత్తపల్లి ఆశ్రమ పాఠశాలలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు ప్రత్యేక వైద్య శిబిరాన్ని స్థానిక సర్పంచ్ గుండి వెంకటేశ్వర్లు ఎంపీటీసీ ధర్మరాజు ,ిప్యూటీ డి ఎం హెచ్ ఓ రాజ్ కుమార్ ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మారుమూల గిరిజన ప్రజల కొరకు ఐటిడిఏ ఆరోగ్యశాఖ స్పెష స్పెషలిస్ట్ డాక్టర్స్ అందరిని ఒకచోట తీసుకొని ప్రజలందరూ పరీక్షలు చేపించుకోవాలని కోరారు డిఎంహెచ్వో రాజ్ కుమార్ మాట్లాడుతూ ఈ క్యాంపులో అన్ని రకాల పరీక్షలు చేయబడిన తెలిపారు 97 మంది గర్భిణీ స్త్రీలకు స్కానింగ్ 27 మంది పిల్లలకు చికిత్సలు 330 మంది సాధన పరీక్షలు చేసి 47 మందికి కంటి పరీక్షలు నిర్వహించడం జరిగిందని అదేవిధంగా 57 మంది రక్తపరీక్షలు తీసుకొని పరీక్షించడం జరిగిందని తెలియజేశారు అవసరమైన వారికి మందులు పంపిణీ చేయడం జరిగింది తెలిపారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్లు చెవి ముక్కు వైద్య నిపుణులు డాక్టర్ హరిప్రియ సాధారణ వైద్య నిపుణులు డాక్టర్ ప్రసన్న డాక్టర్ బాలాజీ దుమ్ముగూడెం చైతన్య వైద్య సిబ్బంది సాగర్ ఈశ్వరమ్మ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు
Post A Comment: