CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

రోజు రోజుకు పెరుగుతున్న విషజ్వరాలు : పట్టించుకోని అధికారులు

Share it:


మన్యం మనుగడ, మంగపేట.

  మంగపేట మండలం రాజుపేట గ్రామంలో నివసిస్తున్న ప్రతి ఇంటికి ఒక పేషంట్ వున్నారు, టైఫాడ్ మలేరియా, డెంగ్యూ వంటి విష జ్వరాలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్న కూడా గ్రామంలో జాడ లేని హెల్త్ క్యాంప్ లు.,పారిశుధ్య పనులు,స్పందించని అధికారులు. తూతు మంత్రంగా గ్రామ పంచాయితీ సిబ్బంది పనులు, రోడ్ల మీద  బ్లీచింగ్ జల్లి, బురద మురుగు నీరు ఉన్న దగ్గర చల్లడంలేదు, ఒక్క ప్రధాన రహదారుల శుభ్రత కొంత వరకు పర్వాలేదు, మిగతా పరిసరాలు పట్టించుకోని పంచాయతీ సిబ్బంది. రాజుపేట గ్రామంలోని దళిత వాడలో విపరీతంగా దోమలు, ఈగలు వర్షాకాలం మొదలైన నుండి ఈ రోజు వరకు   ఫాగింగ్  స్ప్రేయ్  చేయలేదు,ప్రజల ప్రాణ పాయ స్థితి లో ఉన్న కూడా నిమ్మకు నీరెత్తనట్లు వ్యవహరిస్తున్నారు.మెడికల్ క్యాంప్ పెట్టండి అని వేడుకుంటే  అధికారులు ఇద్దరు ఆశావర్కర్లను పంపించడం జరిగింది. ఇది ఏమిటని అడిగితే పట్టించుకునే వారే లేరు. ఒక డాక్టర్ లేరు, ఒక  ఏఎన్ఎం లేరు, ఇదెక్కడి మెడికల్ క్యాంపు అని రాజుపేట గ్రామ ఎస్సి కాలనీ వాసులు వాపోతున్నారు. ములుగు జిల్లా, మంగపేట మండలం అధికారులు ఈ సమస్య మీద ద్రుష్టి పెట్టి ప్రజలను కాపాడ వలసిందిగారాజుపేట గ్రామ దళిత వాడ ప్రజలు పత్రికాముఖంగా తెలియజేశారు.

Share it:

AP

TELANGANA

Post A Comment: