మన్యం మనుగడ , కరకగూడెం:టిఆర్ఎస్ పార్టీతోనే యువతకు బంగారు భవిష్యత్తు ఉంటుందని మండల అధ్యక్షులు రావుల సోమయ్య అన్నారు.
వట్టంవారిగుంపు గ్రామ పంచాయతీ టీఆర్ఎస్ పార్టీ యువజన విభాగం కమిటీ
అధ్యక్షులుగా సిద్ది వినోద్ కుమార్,
ప్రధాన కార్యదర్శిగా బొడ్డు గాంధీ,
ఉపాధ్యక్షులుగా పాయం నరేష్,
కోశాధికారిగా మంచాల సాంబశివరావు,
సంయుక్త కార్యదర్శిగా పెద్ది వెంకటేష్,
ప్రచార కార్యదర్శిగా వట్టం సతీష్,సిద్ది సందీప్ ను ఎన్నుకోవడం జరిగింది.
మండల అధ్యక్షులు రావుల సోమయ్య,మండల యువజన విభాగం అధ్యక్షులు గుడ్ల రంజిత్ కుమార్ నియామకపత్రం అందజేయడం జరిగింది.
ఈ సందర్భంగా వినోద్ మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి నిరంతరం కృషి చేస్తానని,టీఆర్ఎస్ పార్టీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్ళాతమని తెలిపారు.టీఆర్ఎస్ పార్టీ తిరుగులేని శక్తిగా తయారు చేసే విధంగా నా వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు.క్రమశిక్షణతో పార్టీ సిద్ధాంతాలు,కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు.
తనపై నమ్మకం ఉంచి పదవి అప్పగించినందుకు ప్రభుత్వ విప్,పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు గారికి,ప్రజాప్రతినిధులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచు ఆరెం సాంబ,చిరుమల్ల సర్పంచు పాయం నర్సింహారావు,మండల ప్రధాన కార్యదర్శి బుడగం రాము,మండల ఉపాధ్యక్షులు జాడి రామనాథం,మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షులు కొమరం రాంబాబు,
ఆత్మ కమిటీ డైరెక్టర్ కొంపెల్లి పెద్ద రామలింగం,యూత్ ప్రెసిడెంట్ గుడ్ల రంజిత్ కుమార్, మండల యువజన విభాగం ఉపాధ్యక్షులు గాందర్ల సతీష్,మండల యువజన విభాగం కార్యదర్శి సిద్ది సునీల్,పినపాక నియోజకవర్గ యువజన విభాగం ప్రధాన కార్యదర్శి బోడ రవి
తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: